Andhra Pradesh: దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం

  • ఇంతకు ముందు 24వ తేదీని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన ప్రభుత్వం
  • తాజాగా సాధారణ సెలవుగా మార్చిన వైనం
  • 25వ తేదీన పునఃప్రారంభం కానున్న విద్యా సంస్థలు
change in Dasara holidays in AP

ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీని సాధారణ సెలవుగా, 24వ తేదీని ఆప్షనల్ హాలిడేగా ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా 24వ తేదీని ఆప్షనల్ హాలిడే బదులు సాధారణ సెలవుగా మార్చింది. దీంతో 23, 24 రెండు తేదీలు సాధారణ సెలవుగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో విద్యాసంస్థలు తిరిగి 25వ తేదీన తెరుచుకోనున్నాయి. 

More Telugu News