sbi: యూపీఐ సేవల్లో సమస్యలు... ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్

  • టెక్నాలజీ అప్ గ్రేడేషన్ జరుగుతోందన్న ఎస్బీఐ
  • యూపీఐ సేవలలో ఇబ్బందులు ఎదురుకావొచ్చునని వెల్లడి
  • రెండు రోజులుగా యూపీఐ ట్రాన్సాక్షన్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కస్టమర్లు
SBI Customers Face Technical Issue While Using UPI Transactions For Last 2 Days

ఎస్బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. యూపీఐ సేవల్లో ఎస్బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురు కావొచ్చునని తెలిపింది. ఎస్బీఐ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ చేపట్టింది. దీంతో ఎస్బీఐ కస్టమర్లకు యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశముంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించింది.

గత రెండు రోజులుగా ఎస్బీఐ యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో కస్టమర్లు సమస్య ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా సమస్య వస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదని, వారు ఈ సమస్యను ఆనందిస్తున్నట్లుగా ఉన్నారంటూ ఓ నెటిజన్ ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News