India-Pakistan Match: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో మహిళా పోలీస్, ప్రేక్షకుడి మధ్య ఫైట్... వీడియో ఇదిగో!

  • అహ్మదాబాద్ లో నిన్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్
  • వేదికగా నిలిచిన నరేంద్ర మోదీ స్టేడియం
  • ఓ ప్రేక్షకుడికి, మహిళా పోలీసుకు మధ్య వాగ్వాదం
  • ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపించిన పోలీసు
  • పోలీసుపై చేయి విసిరిన ప్రేక్షకుడు... వీడియో వైరల్
Brawl between woman cop and audience during India and Pakistan match

అహ్మదాబాద్ లో నిన్న దాయాదులు భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులకు వందశాతం వినోదం అందించిన మ్యాచ్ ఇది. ఈ పోరుకు వేదికగా నిలిచిన నరేంద్ర మోదీ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1.32 లక్షలు కాగా, స్టేడియం మొత్తం నిండిపోయింది. 

అయితే, ఓవైపు మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుండగా, స్టేడియంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ కు, ప్రేక్షకుడికి మధ్య బాహాబాహీ జరిగింది. 

ఏదో అంశంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండగా మహిళా పోలీసు ఒక్కసారిగా ఆ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపించింది. దాంతో అతడు కూడా మహిళా పోలీసుపై చేయి విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News