Raviteja: రేపే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథులు వీరే!

  • 'టైగర్ నాగేశ్వరావు'గా రవితేజ 
  • కథానాయికగా నుపుర్ సనన్ పరిచయం
  • హైదరాబాదులో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథులుగా కిషన్ రెడ్డి - విజయేంద్ర ప్రసాద్  
  • ఈ నెల 20వ తేదీన సినిమా రిలీజ్  

Tiger Nageshwara Rao Pre Release Event

రవితేజ కథానాయకుడిగా 'టైగర్ నాగేశ్వరరావు' రూపొందింది. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించాడు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ లుక్ తో రవితేజ కనిపించనున్నాడు.దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు కిషన్ రెడ్డి .. విజయేంద్రప్రసాద్ .. హరీశ్ శంకర్ .. గోపీచంద్ మలినేని .. చందూ మొండేటి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ 'శిల్పకళావేదిక'లో ఈ వేడుక మొదలుకానుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాతో, నుపుర్ సనన్ కథానాయికగా పరిచయమవుతోంది.

More Telugu News