Kotamreddy Sridhar Reddy: అక్టోబర్ 24 నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాదయాత్ర

  • ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • 33 రోజుల పాటు సాగే యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటానని వెల్లడి
  • ఈ యాత్రలో మొత్తం లక్షమందితో మాటామంతీ నిర్వహిస్తానన్న ఎమ్మెల్యే
Kotamreddy sridhar reddy to embark on padayatra

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు మద్దతుగా నిర్వహిస్తున్న సంఘీభావ సదస్సుల అనంతరం ఈ యాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అక్టోబర్ 24 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 33 రోజుల పాటు సాగనున్న ఈ పాదయాత్రలో ఆయన లక్షమందితో మాటామంతీ నిర్వహిస్తారు. ప్రజలతో మమేకమై స్థానిక పరిస్థితులు, సమస్యలు కూలంకషంగా తెలుసుకునే లక్ష్యంతో ఈ యాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు.

More Telugu News