Raghu Rama Krishna Raju: చంద్రబాబును సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించండి: గవర్నర్‌కు రఘురామ లేఖ

  • చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని రఘురామ లేఖ
  • ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్న రఘురామ
  • ఐదు కిలోలు తగ్గారని తెలిసిందని, మరింత తగ్గితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన
Raghurama krishnaraju letter to governor

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్నారు. ఈ జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ రఘురామ గవర్నర్‌కు లేఖ రాశారు. మెరుగైన వైద్యం కోసం చంద్రబాబును వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయన్నారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని తెలిసిందని, ఆయన బరువు మరింతగా తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News