cinema: రేపు రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడవచ్చు!

  • జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా రూ.99కే టిక్కెట్
  • తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు
  • తెలంగాణలలోని మల్టీప్లెక్స్‌లలో రూ.112కు టిక్కెట్
films you can watch for Rs 99 in some theatres

సినీ ప్రియులకు శుభవార్త! సాధారణ థియేటర్లలోనే ఒక్కరు సినిమా చూడాలంటే టిక్కెట్ ధర రూ.100 కాస్త అటు ఇటుగా ఉంది. ఓ కుటుంబం చూడాలంటే టిక్కెట్‌లకే రూ.500 అవుతుంది. అదే మల్టీప్లెక్స్‌లలో అయితే చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్‌లలోనే రూ.99కే సినిమా చూడవచ్చు! అయితే ఎప్పటికీ కాదు.. రేపు ఒక్కరోజు మాత్రమే. ఈ శుక్రవారం ఈ బంపర్ ఆఫర్ లభిస్తోంది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా రూ.99కే టిక్కెట్ ను విక్రయించనున్నట్టు చిత్ర ప్రదర్శనదారుల అసోసియేషన్ ప్రకటించింది. 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో రూ.112, కేరళ మల్టీప్లెక్స్‌లలో రూ.129 విక్రయిస్తున్నారు. దేశంలోని చాలాచోట్ల రూ.99కే టిక్కెట్లు విక్రయిస్తున్నారు. అయితే రెగ్యులర్ ఫార్మాట్, నాన్ రెక్లయినర్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి.

More Telugu News