Chaitu: వెంకీ మల్టీ స్టారర్ మూవీలో మరోసారి ఛాన్స్ కొట్టిన చైతూ!

  • సుధాకర్ రెడ్డి దర్శకత్వంలో వెంకటేశ్ 
  • ఇది మల్టీ స్టారర్ కంటెంట్ అంటూ టాక్ 
  • చైతూను ఎంపిక చేసినట్టుగా సమాచారం
  • 'వెంకీ మామ' తరువాత రిపీట్ అవుతున్న కాంబో
Chaitu in Venkatesh Movie

ప్రస్తుతం వెంకటేశ్ 'సైంధవ్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. అందువలన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. 
 
చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే, వెంకటేశ్ ఆ తరువాత ప్రాజెక్టును లైన్లో పెట్టినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. సుధాకర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన చేయనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో నిర్మించనున్నారని అంటున్నారు. 

ఇది మల్టీ స్టారర్ సినిమా అనేది తాజా సమాచారం. అందువలన ఈ సినిమాలో మరో హీరో పాత్రకి గాను చైతూను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'వెంకీమామ' తరువాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం చందూ మొండేటి ప్రాజెక్టుతో చైతూ బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన వెంకీ ప్రాజెక్టులో జాయిన్ అవుతాడని అంటున్నారు.

More Telugu News