ICC World Cup: వరల్డ్ కప్: నేటి రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ తో శ్రీలంక ఢీ

  • వరల్డ్ కప్ లో నేడు రెండు మ్యాచ్ లు
  • రెండో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • నిలకడగా శ్రీలంక ఇన్నింగ్స్
Pakistan takes of Sri Lanka in Hyderabad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో నేడు రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. ధర్మశాలలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతుండగా, మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన రెండో మ్యాచ్ లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఆడుతున్నాయి. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కుశాల్ పెరీరా (0) డకౌట్ అయినప్పటికీ శ్రీలంక నిలకడగా ఆడుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి లంక జట్టు స్కోరు 1 వికెట్ నష్టానికి 98 పరుగులు. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 48 పరుగులు, కుశాల్ మెండిస్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 1 వికెట్ తీశాడు.

More Telugu News