Karthi: 'ఖైదీ' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్

  • 2019లో వచ్చిన కార్తి 'ఖైదీ'
  • దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ ను నిలబెట్టిన సినిమా 
  • సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ 
  • రజనీ సినిమా తరువాత ఉంటుందని చెప్పిన డైరెక్టర్ 
Khaidi Sequel Update

వందల కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడటంతో పోలీసులు ఆ సరుకును ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతారు. ఆ సరుకు బయటికి రావాలంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న విలన్ బయటికి రావాలి. అతని కోసం ఆ స్టేషన్ కి విలన్ గ్యాంగ్ బయలుదేరుతుంది. అదే స్టేషన్ లో ఆ రోజున తన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఒక కానిస్టేబుల్ బయల్దేరతాడు. 

జైలు నుంచి విడుదలై తన కూతురును చూడటానికి వెళుతున్న ఓ ఖైదీ సాయంతో, లారీలో ఆ పోలీస్ స్టేషన్ కి ఓ పోలీస్ ఆఫీసర్ బయల్దేరతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనేదే కార్తి 'ఖైదీ' కథ. సింగిల్ కాస్ట్యూమ్ తో మొదటి నుంచి చివరి వరకూ హీరోను చూపించిన కథ .. అసలు హీరోయిన్నే లేని కథ. ఆ సినిమా సీక్వెల్ కోసం ఇప్పటికీ చాలామంది ఎదురుచూస్తున్నారు. 

సంచలన విజయాన్ని అందుకున్న ఆ సినిమా సీక్వెల్ పై, తాజాగా లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ .. రజనీకాంత్ తో చేయనున్న సినిమా తరువాత 'ఖైదీ' సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. తాను కూడా ఆ రోజు కోసం చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అన్నాడు. ఆ సినిమా సీక్వెల్ తనకి చాలా ప్రత్యేకమైనదని చెప్పాడు. ప్రస్తుతం ఆయన 'లియో' సినిమా పనులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

More Telugu News