రేపు తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్‌ షా.. పర్యటన షెడ్యూల్‌ ఇదే

కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. ఆయన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం అదిలాబాద్‌లోని డైట్ కళాశాల మైదానంలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్‌లోను అదే రోజు అమిత్ షా సభ నిర్వహించాలని బీజేపీ భావించింది. కానీ ఈ సభ రద్దయింది. దీనికి బదులు సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం ఏడున్నర గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో ఐటీసీ కాకతీయలో సమావేశం కానున్నారు.

అమిత్ షా షెడ్యూల్

* రేపు మధ్యాహ్నం గం.1.45 కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* మధ్యాహ్నం గం.2.35కు ప్రత్యేక హెలికాప్టర్‌లో అదిలాబాద్‌కు చేరుకుంటారు
* మధ్యాహ్నం గం.3 కు గం.4  వరకు అదిలాబాద్ సభలో పాల్గొంటారు.
* గం.4.15కు అదిలాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు
* గం.5.05కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* గం.5.20 నుంచి సాయంత్రం గం.6 వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం
* గం.6 కు ఇంపీరియల్ గార్డెన్ చేరుకుంటారు.
* గం.6.20 నుంచి గం.7.20 వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో సమావేశం
* రాత్రి గం.7.40 సయానికి ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ.
* రాత్రి గం.9.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్న అమిత్ షా.

Amit Shah
BJP
Telangana
Telangana Assembly Election

More Telugu News