Punjab: పేలిన ఫ్రిడ్జ్.. ముగ్గురు చిన్నారుల సహా కుటుంబంలోని ఐదుగురి మృతి

  • పంజాబ్‌లోని జలంధర్‌లో ఘటన
  • భారీ శబ్దంతో పేలిన ఫ్రిడ్జ్‌లోని కంప్రెషర్
  • ఆ వెంటనే ఇంటికి మంటలు
Fridge compressor explodes in Jalandhar 5 dead including 3 children

పంజాబ్‌లోని జలంధర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలడంతో కుటుంబంలోని ముగ్గురు చిన్నారుల సహా ఐదుగురు మృతి చెందారు. అవతార్ నగర్ ప్రాంతంలో గత రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఫ్రిడ్జ్‌లోని కంప్రెషర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. 

పేలుడుతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన యశ్‌పాల్ ఘాయ్ (70), రుచి ఘాయ్ (40), మాన్సా (14), దియా (12), అక్షయ్ (10)లను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించింది.

More Telugu News