Team India: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్... 2 పరుగులకు ముగ్గురు డకౌట్

  • చెన్నైలో భారత్ వర్సెస్ ఆసీస్
  • మొదట 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆసీస్ ఆలౌట్
  • లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ 
  • భారత టాపార్డర్ ను వణికించిన హేజెల్ వుడ్, స్టార్క్
Team India loses 3 early wickets

చెన్నైలో ఆసీస్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 200 పరుగుల లక్ష్యమే కదా... ఎంతో సులువు అని భావించి... ఛేదనకు బరిలో దిగిన టీమిండియాకు ఆరంభంలోనే దిమ్మదిరిగిపోయింది. కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ ముగ్గురూ డకౌట్ అయ్యారు. 

తొలి ఓవర్లోనే మిచెల్ స్టార్క్ ఓ అద్భుతమైన అవుట్  స్వింగర్ తో ఇషాన్ కిషన్ ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఓవర్లో హేజెల్ వుడ్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ల వికెట్లు తీసి టీమిండియాకు దిగ్భ్రాంతి కలిగించాడు. ముగ్గురు టాప్ బ్యాట్స్ మెన్ ఒక్క పరుగు చేయకుండా వెనుదిరగడంతో మైదానంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. 

ప్రస్తుతం టీమిండియా 4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 10 పరుగులు  చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (4 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (4 బ్యాటింగ్) ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే.

More Telugu News