ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్లతో దాడి, భారత పౌరులకు అడ్వైజరీ
- ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడి
- భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన ఎంబసీ
- అప్రమత్తంగా ఉండాలని సూచన
- స్థానిక అధికారులు సూచించిన భద్రతాపరమైన ప్రోటోకాల్ పాటించాలని వెల్లడి
గాజాలోని హమాస్ మిలెటెంట్లు శనివారం ఉదయం ఇజ్రాయెల్పై మెరుపుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లను ప్రయోగించారు. భూభాగంలోకి చొచ్చుకు వెళ్లారు. వీరిని ఇజ్రాయెల్ సైన్యం ప్రతిఘటిస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది.