ODI World Cup: వన్డే ప్రపంచ కప్ ప్రారంభం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

  • అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం
  • తొలి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్
  • 4 ఓవర్లకు 21 పరుగులు చేసిన ఇంగ్లండ్
New Zealand won the toss and elected to field in first ODI of World cup 2023

అతిపెద్ద క్రికెట్ ఈవెంట్ వన్డే వరల్డ్ కప్ ప్రారంభమయింది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ ను ఓపెనర్లు డేవిడ్ మలాన్, బెయిర్ స్టో ప్రారంభించారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. బెయిర్ స్టో 12 పరుగులు, మలాన్ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ కు కుమార ధర్మసేన, నితిన్ మీనన్ అంపైర్లుగా... జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రెఫరీగా వ్యవహరిస్తున్నారు. 

More Telugu News