Chandrababu: రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబు
  • ఏ2గా ఉన్న మాజీ మంత్రి పి.నారాయణ
  • ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు వేసిన నారాయణ
AP High Court to hear Chandrababu bail petition in inner ring road case

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు వస్తోంది. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి పి.నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు కూడా హైకోర్టులో విచారణకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ తో కలిసి రేపు తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.

More Telugu News