తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ... లోక్ సభ ఎన్నికలపై టైమ్స్ నౌ తాజా సర్వే

  • టైమ్స్ నౌ సర్వేలో ఆసక్తికర అంశాలు
  • తెలంగాణలో బీఆర్ఎస్ కు 9 నుంచి 11 ఎంపీ స్థానాలు వస్తాయని వెల్లడి
  • ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయొచ్చన్న టైమ్స్ నౌ
  • వైసీపీకి 24 నుంచి 25 స్థానాలు వస్తాయని వివరణ
జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ లోక్ సభ ఎన్నికలపై తాజాగా సర్వే నిర్వహించింది. లోక్ సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 9 నుంచి 11 స్థానాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ 3 నుంచి 4 స్థానాలు, బీజేపీ 2 నుంచి 3 స్థానాలు, ఓ స్థానంలో ఇతరులు గెలిచే అవకాశాలున్నట్టు తెలిపింది. 

ఇక, ఏపీలో లోక్ సభ ఎన్నికలపైనా టైమ్స్ నౌ ఆసక్తికర అంశాలు పంచుకుంది. ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పింది. వైసీపీ 24 నుంచి 25 లోక్ సభ స్థానాలు చేజిక్కించుకుంటుందని పేర్కొంది. ఓట్ల శాతంలో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, అదేమీ వైసీపీ క్లీన్ స్వీప్ ను అడ్డుకోలేదని టౌమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. ఒక్క స్థానంలో మాత్రం ఫలితం అటూ ఇటూగా ఉండే అవకాశాలున్నాయని, అక్కడ టీడీపీ అభ్యర్థి గెలవొచ్చని వివరించింది.

BRS
YSRCP
Telangana
Andhra Pradesh
Times Now Survey
Lok Sabha Elections

More Telugu News