Shivaraj Kumar: శివరాజ్ కుమార్ 'ఘోస్ట్' ట్రైలర్ ను రిలీజ్ చేసిన రాజమౌళి!

  • శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన 'ఘోస్ట్'
  • యాక్షన్ ప్రధానంగా సాగే కథాకథనాలు 
  • పవర్ఫుల్ డైలాగ్ తో దూసుకెళుతున్న ట్రైలర్
  • ఈ నెల 19వ తేదీన విడుదల కానున్న సినిమా
Ghost telugu trailer released

శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం 'ఘోస్ట్'. దర్శకుడు శ్రీని 'ఘోస్ట్' చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. 

అక్టోబర్ 1న చిత్ర బృందం 'ఘోస్ట్' చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది. డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు ట్రైలర్ ను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై ఓల్టేజ్ యాక్షన్ తో రోమాంఛితంగా ఉంది. ట్రైలర్ ఇంతక ముందెన్నడూ చూడని యాక్షన్ తో ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. శివ రాజ్ కుమార్ హైలైట్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు దర్శకుడు శ్రీని తనదైన విజన్ తో హీరోయిజం నీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. 

"నేను నార్మల్ గా ఎవరి జోలికి వెళ్ళను ఒడిపోతాననే భయం కాదు .. నేను వెళితే రణరంగం మారణహోమంగా మారుతుంది.." అనే డైలాగ్ శివ రాజ్ కుమార్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా తెరకెక్కించారో చెబుతోంది. సంగీత దర్శకుడు అర్జున్ జన్య అందించిన సంగీతం యాక్షన్ సీన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వింటేజ్ శివన్న యంగ్ గా కనబడే షాట్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా ఉండనున్నాయి. ట్రైలర్ ఘోస్ట్ మీద ఉన్న అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది.

More Telugu News