Aditya L-1: భూ గురుత్వాకర్షణ పరిధి దాటి వెళ్లిన ఆదిత్య ఎల్-1

  • సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1 ప్రయోగం
  • సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్-1ను నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-57
  • ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం పయనించిన ఆదిత్య ఎల్-1
  • 15 లక్షల కి.మీ దూరంలోని లెగ్రేంజ్ పాయింట్ 1 దిశగా ప్రయాణం
Aditya L1 update freom ISRO

అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఇటీవల చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ కాగా, తాజాగా, సూర్యుడి గురించి పరిశోధనల నిమిత్తం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 స్పేస్ క్రాఫ్ట్ సాఫీగా ముందుకు వెళుతోంది. 

ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూ గురుత్వాకర్షణ పరిధిని దాటినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. 

ఆదిత్య ఎల్-1 ఇప్పుడు భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రేంజ్ పాయింట్ 1 దిశగా వెళుతోందని వివరించింది. లెగ్రేంజ్ పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఇక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేపట్టేందుకు ఉపగ్రహాలకు అనువుగా ఉంటుంది. 

ఈ నెల 2న ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని మోసుకుంటూ పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్  నింగిలోకి దూసుకెళ్లడం తెలిసిందే. ఇస్రోకు నమ్మినబంటుగా పేరుగాంచిన పీఎస్ఎల్వీ రాకెట్ ఆదిత్య ఎల్-1 ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

More Telugu News