Nara Lokesh: నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు

  • ఢిల్లీలో గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న లోకేశ్
  • తొలుత వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన సీఐడీ అధికారులు
  • అనంతరం గల్లా  జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసుల అందజేత 
  • నోటీసులు అందాయని సీఐడీ అధికారులకు రిప్లయ్ ఇచ్చిన లోకేశ్
  • అక్టోబరు 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలన్న సీఐడీ
CID send notice to Nara Lokesh in Inner Ring Road case

ఢిల్లీలో తాను ఎక్కడున్నదీ నారా లోకేశ్ స్పష్టం చేసిన నేపథ్యంలో, ఏపీ సీఐడీ అధికారులు ఈ మధ్యాహ్నం ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత వాట్సాప్ లో నోటీసులు పంపిన సీఐడీ అధికారులు, ఆ తర్వాత లోకేశ్ తాను ఎక్కడున్నదీ చెప్పడంతో గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందినట్టు లోకేశ్ సీఐడీ అధికారులకు బదులిచ్చారు. 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఈ నోటీసులు పంపారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదైంది. ఇటీవలే ఈ కేసులో ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చడం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా, తాము 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ చెప్పడంతో హైకోర్టు లోకేశ్ బెయిల్ పిటిషన్ విచారణను ముగించింది.

More Telugu News