Gautam Gambhir: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గంభీర్ దంపతులు

  • ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన గంభీర్
  • క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్‌కు అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య
  • 140 కోట్ల మంది ప్రార్థనలతో ప్రపంచకప్ గెలుస్తామని ఆశాభావం
Gautam Gambhir visited tirumala temple

భారత జట్టు మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దంపతులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. గురువారం శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకొని, సుప్రభాతసేవలో సతీసమేతంగా పాల్గొన్నారు. గంభీర్ దంపతులకు ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల గంభీర్ మాట్లాడుతూ... వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తామన్నారు. కాగా గంభీర్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.

More Telugu News