గడప గడపకు కార్యక్రమంపై రేపు జగన్ సమీక్ష.. వైసీపీ ఎమ్మెల్యేలలో హై టెన్షన్
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమీక్ష
- ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ కు ఇప్పటికే అందిన నివేదిక
- ఎమ్మెల్యేల పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న జగన్
ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఇప్పటికే జగన్ కు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేల భవిష్యత్తు రేపు తేలిపోనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోతోంది. కొంత మంది ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసినప్పటికీ... 60 నుంచి 70 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదిన్నర గడుస్తున్నా టార్గెట్ ను పూర్తి చేయని వారిపై జగన్ అసంతృప్తితో ఉన్నారని చెపుతున్నారు.