ఎన్డీయేకు అన్నాడీఎంకే గుడ్ బై చెప్పడంపై బీజేపీ స్పందన
- ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించిన అన్నాడీఎంకే
- ఈ ప్రకటనపై స్పందించిన రాష్ట్ర బీజేజీ అధ్యక్షుడు అన్నామలై
- సరైన సమయంలో పార్టీ హైకమాండ్ స్పందిస్తుందని వ్యాఖ్య
ఈ ప్రకటన వెలువడిన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తొలిసారి స్పందించారు. అన్నాడీఎంకే నిర్ణయంపై పార్టీ హైకమాండ్ సరైన సమయంలో స్పందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాను పాదయాత్ర చేస్తున్నానని... అన్నాడీఎంకే ప్రకటనను ఇప్పుడే చదివానని చెప్పారు. అన్నామలై పాదయాత్ర ప్రస్తుతం కోయంబత్తూరు నార్త్ నియోజకవర్గంలో కొనసాగుతోంది.