Tollywood: వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’ మొదలైంది

  • పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న చిత్రం
  • హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి
  • సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్
Dulquer Salmaan launches his Pan India film directed by Venky Atluri

వైవిధ్యమైన కథలతో దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌. ‘సీతారామం’ చిత్రం ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. దుల్కర్ ఇప్పుడు నేరుగా తెలుగులో తెలుగు దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ‘లక్కీ భాస్కర్‌’ టైటిల్‌తో ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం కొలవలేని ఎత్తులకు, ఉన్నత శిఖరాలకు చేరిన వైనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించ బోతున్నామని దర్శకుడు తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News