Tollywood: వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’ మొదలైంది

Dulquer Salmaan launches his Pan India film directed by Venky Atluri

  • పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న చిత్రం
  • హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి
  • సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్

వైవిధ్యమైన కథలతో దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌. ‘సీతారామం’ చిత్రం ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. దుల్కర్ ఇప్పుడు నేరుగా తెలుగులో తెలుగు దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ‘లక్కీ భాస్కర్‌’ టైటిల్‌తో ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం కొలవలేని ఎత్తులకు, ఉన్నత శిఖరాలకు చేరిన వైనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించ బోతున్నామని దర్శకుడు తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

  • Loading...

More Telugu News