Uttar Pradesh: టీ తాగటానికి పోలీసులు వ్యాన్ ఆపడంతో నిందితుల పరార్

  • ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఘటన
  • ముగ్గురు దొంగలను కోర్టుకు తరలిస్తూ మార్గమధ్యంలో వ్యాన్ ఆపి టీ తాగిన పోలీసులు 
  • వ్యాన్ తలుపులు లాక్ చేయకపోవడంతో దొంగల పరార్
Robbers escape from custody as police stop for a tea break leaving the van unlocked

విధినిర్వహణ పోలీసులు ఏమరపాటుగా వ్యవహరించడంతో ముగ్గురు దొంగలు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఆ ముగ్గురు దొంగలను కోర్టుకు వ్యానులో తీసుకెళుతుండగా దొంగలు తప్పించుకున్నారు. మార్గమధ్యంలో పోలీసులు టీ కోసం వ్యానును ఆపారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారట. ఈ క్రమంలో వ్యానులోని ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

More Telugu News