హైదరాబాదులో ప్రేక్షకులు లేకుండానే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్!

Hyderabad police advises HCA to conduct world warm up match with out spectators
  • అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్
  • టోర్నీకి ముందు సన్నాహక మ్యాచ్ లు
  • సెప్టెంబరు 29న ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్-న్యూజిలాండ్ ప్రాక్టీసు మ్యాచ్
  • గణేశ్ నిమజ్జనం ఉండడంతో మ్యాచ్ కు తాము భద్రత కల్పించలేమన్న పోలీసులు
భారత్ లో అక్టోబరు 5 నుంచి ఐసీసీ వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, టోర్నీకి ముందు ఆయా జట్లు సన్నాహక మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ నెల 29న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. 

అయితే, ఈ ప్రాక్టీసు మ్యాచ్ పై పోలీసులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలో గణేశ్ నిమజ్జనం ఉండడంతో, ఆ దిశగా మరింత భద్రతను అందించాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. 

స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేట్టయితే అత్యధిక సంఖ్యలో పోలీసులతో భద్రత అందించాల్సి ఉంటుందని, గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో తాము పెద్ద సంఖ్యలో పోలీసులతో భద్రత కల్పించలేమని వివరించారు. అందుకే పాక్-కివీస్ వార్మప్ మ్యాచ్ ను ప్రేక్షకులు లేకుండానే జరుపుకోవాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) పెద్దలకు పోలీసులు వివరించారు. 

పోలీసుల సూచనలను హెచ్ సీఏ పాటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 1,500 టికెట్లు విక్రయించినప్పటికీ, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరపడానికే హెచ్ సీఐ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
World Cup
Warm Up Match
Uppal Stadium
Police
HCA
Hyderabad

More Telugu News