బాలకృష్ణకు ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు కౌంటర్
- ఏపీ అసెంబ్లీలో మీసం మెలేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
- ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు విమర్శలు
- బ్లడ్, బ్రీడ్ వేరని మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ.. నాది తెలుగు గడ్డ అంటూ చురకలు
ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఓ సమయంలో బాలకృష్ణ మీసం మెలేసి సవాల్ చేయగా, మంత్రి అంబటి అప్పుడే కౌంటర్ ఇచ్చారు. ఈ మీసాలు తిప్పడం సినిమాల్లో చేసుకోవాలన్నారు.
అయితే సభలో బాలకృష్ణ మీసాలు తిప్పడంపై ఆ తర్వాత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. తన బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ! నాది తెలుగు గడ్డ! అంటూ ట్వీట్ చేశారు.