పోస్ట్మార్టంకు తరలిస్తుండగా పోలీస్ అధికారి శరీరంలో కదలికలు
- పంజాబ్లోని లూథియానాలో వెలుగు చూసిన ఘటన
- విషపు పురుగు కుట్టడంతో పోలీసు అధికారిని ఆసుపత్రిలో చేర్చిన కుటుంబసభ్యులు
- అనారోగ్యంతో తమ కుమారుడు మరణించారని ఆసుపత్రి వైద్యులు చెప్పినట్టు తండ్రి వెల్లడి
- మరుసటి రోజు పోస్ట్మార్టంకు తరలిస్తుండగా పోలీసు అధికారి శరీరంలో కదలికలు
- మరో ఆసుపత్రికి ఆయన తరలింపు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
మరుసటి రోజు మన్ప్రీత్ను పోస్ట్మార్టం కోసం తరలిస్తుండగా ఆయన శరీరంలో కదలికలు రావడాన్ని అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి గుర్తించారు. వెంటనే ఆయనను మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన్ప్రీత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తమ ఆసుపత్రిలోని సిబ్బంది ఎవరూ మన్ప్రీత్ మరణించినట్టు చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.