KTR: కేటీఆర్‌‌కు స్వాగత ఫ్లెక్సీలు కడుతున్న నలుగురికి కరెంట్ షాక్

  • హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్ బస్టాప్ సమీఫంలో ఉదయం 5 గంటలకు ఘటన
  • ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
  • ఈ రోజు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కోసం కుత్బుల్లాపూర్‌‌కు వస్తున్న కేటీఆర్
Four people electrocuted while arranging KTR flexies

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్‌కి వసున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఆ ప్రాంతమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఉదయం 5 గంటల సమయంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ బస్టాప్ సమీపంలో కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతున్న కొందరికి విద్యుత్ షాక్ తలిగింది. ఈ ఘటనలో విఠల్ (19), దుర్గేష్ (19 ), బాలరాజు (18), నాగనాథ్ (33)కు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన నాగ్ నాథ్ ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

More Telugu News