Narendra Modi: నారీ శక్తి బిల్లుకు భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు: ప్రధాని మోదీ వ్యాఖ్య

  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ అని పేరు పెట్టినట్లు చెప్పిన ప్రధాని
  • నారీ శక్తి బిల్లును చట్టం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
  • మహిళా సాధికారతపై కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని వ్యాఖ్య
God has chosen me to ensure womens quota says pm modi

మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చే భాగ్యాన్ని ఆ భగవంతుడు తనకు ఇచ్చాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ బిల్లుకు తాము ముందడుగు వేయబోతున్నామన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో సభ కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... మహిళా సాధికారతపై కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదన్నారు.

మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని గుర్తి చేశారు. కానీ ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టాక ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అనే పేరు పెట్టినట్లు చెప్పారు. ఈ నారీ శక్తి బిల్లును చట్టం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. కాగా, మధ్యాహ్నం మూడు గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News