Telangana Liberation Day: పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా తెలంగాణ విమోచన దినోత్సవం

Central government celebrates Telangana liberation day in parade grounds
  • కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
  • ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు
  • తొలుత వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళి
  • అనంతరం, జాతీయ జెండా ఆవిష్కరణ
  • నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శమని అమిత్ షా వ్యాఖ్య

నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విమోచన పోరాటంలో పాల్గొన్న అమరవీరులకు వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు. 

అనంతరం, అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని అమిత్ షా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో అమిత్ షాతో పాటూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News