Hyderabad: ఇంట్లో దాచిన రూ.4 కోట్లు మాయం.. హైదరాబాద్ లో వాస్తు నిపుణుడి ఇంట్లో భారీ చోరీ

  • బంగారు కడ్డీలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
  • ఈ నెల 12న మధురానగర్ లో చోటుచేసుకున్న ఘటన
  • ఉదయం బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా ఖాళీ
Robbery In MadhuraNagar hyderabad

హైదరాబాద్ లోని మధురానగర్ లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఇల్లు కొనుగోలు చేసేందుకు దాచుకున్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా ఊడ్చుకెళ్లారని బాధితుడు వాపోతున్నాడు. ఈ నెల 12న జరిగిన ఈ చోరీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

మధురానగర్ కు చెందిన వాస్తు నిపుణుడు వీఎల్ఎన్ చౌదరి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. యజమాని ఖాళీ చేయాలని చెప్పడంతో ఇల్లు కొనుక్కుని అందులోకి మారాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకులో దాచుకున్న సొమ్మును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 12న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చౌదరి.. అర్ధరాత్రి ప్రాంతంలో తిరిగి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెడుతూనే చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో దాచిన రూ.3.93 కోట్ల నగదుతో పాటు 450 గ్రాముల బంగారు కడ్డీలు, మూడు ల్యాప్ టాప్ లు, పలు విలువైన పత్రాలు దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.

More Telugu News