మార్చురీలో శవం తమ కుమారుడిదేనని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. చివర్లో పోలీసుల తీపి కబురు!
- యూపీలో ముజఫర్నగర్లో ఘటన
- ఓ యువకుడిని కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసుల గాలింపు చర్యలు
- మార్చురీలోని శవం అతడిదేమోనని అనుమానం
- శవంపై టాటూ ఆధారంగా ఆ మృతదేహం తమ కుమారుడిదేనని పొరపాటు పడ్డ తల్లిదండ్రులు
- అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా యువకుడు మరో చోట జీవించే ఉన్నాడని పోలీసుల కబురు
దీంతో, మోంటూ కుటుంబాన్ని మార్చురీ వద్దకు పిలిపించారు. తల భాగం లేకపోవడంతో శవంపై టాటూ ఆధారంగా అది తమ కుమారుడేనని గుర్తించిన అతడి తల్లిదండ్రులు బోరుమన్నారు. యువతి కుటుంబమే తమ కుమారుడిని అంతం చేసిందని ఆరోపించారు. బుధవారం రాత్రి వారు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. చివరకు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మోంటూ ఆ యువతితో కలిసి చండీఘడ్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విషయం మోంటూ కుటుంబానికి చెప్పడంతో వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది.