కాంగ్రెస్ పెద్దలతో షర్మిల టచ్లో ఉన్నారు: కేసీ వేణుగోపాల్
- రేపటి సీడబ్ల్యుసీ సమావేశం గేమ్ ఛేంజర్గా మారుతుందని వ్యాఖ్య
- సోనియాగాంధీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్లు ప్రజల్లోకి తీసుకు వెళ్తామని వెల్లడి
- తెలంగాణ అత్యంత అవినీతి రాష్ట్రంగా మారిందని విమర్శ
18 మంది నేతలు తెలంగాణవ్యాప్తంగా పర్యటించి సోనియా గాంధీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకువెళ్తారన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలపై సీడబ్ల్యుసీ చర్చిస్తుందన్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా మారిందన్నారు. మోదీ, కేసీఆర్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు.