Team India: ఆసియా కప్: నామమాత్రపు మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ ఢీ

  • ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్లోకి భారత్, శ్రీలంక
  • ఇవాళ్టి మ్యాచ్ కు ప్రాధాన్యం లేని వైనం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • వన్డేల్లో అరంగేట్రం చేస్తున్న తిలక్ వర్మ
India elected bowling first against Bangladesh in Asia Cup

ఆసియా కప్ లో భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ లో ప్రవేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే సూపర్-4 చివరి మ్యాచ్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది. నామమాత్రంగా మారిన ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత కొన్నిరోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్న కొలంబో నగరంలోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. 

కాగా, తెలుగుతేజం తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఎల్లుండి (సెప్టెంబరు 17) జరిగే ఫైనల్ ను దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లకు విశ్రాంతి కల్పించారు. షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు.

More Telugu News