Raghu Rama Krishna Raju: జనసేనాని ప్రకటన శుభపరిణామం.. రఘురామకృష్ణరాజు

  • జనసేన ఎరుపు, టీడీపీ పసుపు కలిస్తే కాషాయం వస్తుందన్న రఘురామ 
  • బీజేపీ పెద్దల మనసులో ఏముందో పవన్ కల్యాణ్‌కు తెలుసునన్న ఎంపీ
  • ఏపీలో 160 సీట్లు గెలవడం ఖాయమని వ్యాఖ్య 
Raghurama Krishnaraju on Pawan Kalyan alliance announcement

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి నడుస్తాయన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. గురువారం ఆయన మాట్లాడుతూ... జనసేనాని ప్రకటన శుభపరిణామమన్నారు. జనసేన ఎరుపు, టీడీపీ పసుపు కలిస్తే కాషాయం రంగు వస్తుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అందుకే ఈ పొత్తుకు బీజేపీ కూడా సమ్మతిస్తుందని తాను భావిస్తున్నానన్నారు. బీజేపీ పెద్దల మనసులో ఏముందో జనసేనానికి తెలుసు కాబట్టే పొత్తు గురించి ఇప్పుడు బాహాటంగా చెప్పారన్నారు. మున్ముందు ఈ మూడు పార్టీల కలయిక కారణంగా ఏపీలో 160 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News