Telangana: ఉచితంగా 5 లక్షల మట్టి గణపతి ప్రతిమలు.. పంపిణీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

  • గణేశ్ నవరాత్రుల్లో ఎకో ఫ్రెండ్లీ ప్రతిమలను
    ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • జీహెచ్ఎంసీ 150 వార్డు కార్యాలయాల్లో అందుబాటులో
  • హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరో 50 ప్రాంతాల్లో పంపిణీ
KTRBRS  commenced the free distribution of 5 lakh eco friendly Ganesh idols

పర్యావరణ పరిరక్షణకు గణేశ్‌ నవరాత్రుల్లో మట్టి గణపతి విగ్రహాలను పూజించడాన్ని కొన్నేళ్లుగా  తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రతి ఏటా ప్రభుత్వం వివిధ శాఖల తరఫున వివిధ మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది హెచ్ఎండీఏ అధ్వర్యంలో ఐదు లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతుల ప్రతిమలను ఉచితంగా అందించనుంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ 150 వార్డు కార్యాలయాల్లో ఇవి అందుబాటులో వుంటాయి. అలాగే, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరో 50 ప్రాంతాల్లో వీటిని ప్రజలకు ఉచితంగా అందించనున్నారు.

More Telugu News