Gone Prakash Rao: చంద్రబాబు నెత్తిమీద జగన్ పాలు పోశాడు.. టీడీపీకి 151కి పైగా సీట్లు వస్తాయి: గోనె ప్రకాశ్ రావు

  • చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి మేలు చేస్తుందన్న గోనె ప్రకాశ్ రావు
  • జగన్ శాడిస్ట్ గా వ్యవహరిస్తున్నాడని విమర్శ
  • కాంగ్రెస్ ను రేవంత్ నాశనం చేస్తున్నాడని మండిపాటు
TDP will will 151 seats says Gone Prakash Rao

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. గత ఎన్నికల రికార్డును సైతం బద్దలు కొడుతూ టీడీపీ 151కి పైగా సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమని... ఆయన నెత్తిమీద జగన్ పాలు పోశారని అన్నారు. జగన్ శాడిస్టులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటని అన్నారు. 

ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గోనె ప్రకాశ్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ అనేవాడు నాశనం చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటున్న షర్మిలను రాకుండా అడ్డుకుంటున్నాడని... 2014లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందాడని, మరి ఆయనను కాంగ్రెస్ లోకి ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే తీసుకున్నాడని ఆరోపించారు. 

More Telugu News