వైసీపీ డ్రామాకు త్వరలో తెరపడుతుంది... కార్యకర్తలు ధైర్యంగా ఉండండి: నారా లోకేశ్
- సత్యమే గెలుస్తుంది.. అధైర్యపడవద్దని కార్యకర్తలకు పిలుపు
- భావోద్వేగాలకు లోను కావొద్దని... అంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పిన లోకేశ్
- శాంతి యుత నిరసనలపై హత్యాయత్నం కేసులు సీఎంలోని భయానికి నిదర్శనమన్న లోకేశ్
నిరాహారదీక్ష చేస్తే హత్యాయత్నం కేసులా?
రాష్ట్రంలో అక్రమ కేసుల విషయంలో జగన్ ప్రభుత్వ పైత్యం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని లోకేశ్ అన్నారు. అధినేత అరెస్టుపై శాంతి యుత నిరసనలు చేసిన వారిపైనా హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జగన్ ఫ్రస్ట్రేషన్కు, భయానికి నిదర్శనమన్నారు. శ్రీకాళహస్తిలో నిన్న సామూహిక నిరాహార దీక్షకు దిగిన 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్ కు పంపించడంపై లోకేశ్ మండి పడ్డారు. నిరాహార దీక్షలకు, దిష్టబొమ్మ దహనాలకు కేసులుపెట్టి రిమాండ్ కు పంపే పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేదన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ప్రజల్లో ఉన్న ఆవేదన, ఆగ్రహం బయటకు కనపడకుండా చేయడానికే ఈ అక్రమ కేసుల కుట్రలు అని ఆరోపించారు. పసుపు జండా చూసినా... పసుపు దళం గళం విన్నా జగన్ కు వెన్నువణుకుతోందన్నారు. అందుకే నియంత నిర్ణయాలతో టీడీపీని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.