Team India: నేనున్నానంటూ వచ్చేసిన వరుణుడు... నిలిచిపోయిన భారత్-పాక్ మ్యాచ్

  • ఆసియా కప్ లో నేడు భారత్ తో పాకిస్థాన్ అమీతుమీ
  • 25వ ఓవర్లో వరుణుడు ప్రత్యక్షం
  • అప్పటికి భారత్ స్కోరు 2 వికెట్లకు 147 పరుగులు
  • ఓ మోస్తరు వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేసిన సిబ్బంది
Rain interrupts India and Pakistan match in Asia Cup

ఆసియా కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లను వరుణుడు వెంటాడుతున్నాడు. కొన్నిరోజుల కిందట భారత్, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. ఇప్పుడు సూపర్-4 దశలోనూ ఈ రెండు జట్లు తలపడగా, వర్షం మరోసారి ప్రత్యక్షమైంది. టీమిండియా 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసిన దశలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఓ మోస్తరు వర్షం పడడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు.  

వర్షంతో అంతరాయం కలిగే సమయానికి కేఎల్ రాహుల్ 17, విరాట్ కోహ్లీ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 56, శుభ్ మాన్ గిల్ 58 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 1, షహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు.

More Telugu News