భారత్ లో ముగిసిన బైడెన్ టూర్
- వియత్నాం బయలుదేరి వెళ్లిన అమెరికా ప్రెసిడెంట్
- రాజ్ ఘాట్ నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ చేరుకున్న బైడెన్
- ఎయిర్ ఫోర్స్ వన్ లో వియత్నాంకు పయనం
మహాత్ముడికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ లో వియత్నాం బయలుదేరి వెళ్లారు. వియత్నాంలో కూడా బైడెన్ రెండు రోజుల పాటు పర్యటిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. ఆది, సోమ వారాలు బైడెన్ వియత్నాంలోనే ఉంటారని, మంగళవారం తిరిగి అమెరికా బయలుదేరుతారని చెప్పారు. కాగా, వియత్నాం పర్యటనలోనూ బైడెన్ ద్వైపాక్షిక సంబంధాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారని సమాచారం.

