G20 summit: జీ-20 సదస్సు ప్రారంభం.. మొరాకో భూకంప విషాదంపై ప్రధాని మోదీ సంతాపం

  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తీకరణ
  • మొరాకోకు వీలైనంత సాయం చేస్తామని ప్రకటన
  • రెండు రోజుల పాటు కీలక అంశాలపై చర్చ
African Union formally admitted to G20 summit started

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జీ-20 సదస్సు ప్రారంభమైంది. ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘జీ-20 సదస్సు కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఈ కష్టకాలంలో మొరాకోకు వీలైన ప్రతి సాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని ప్రకటించారు. 

ఇక జీ-20 లో కొత్తగా ఆఫ్రికన్ యూనియన్ కూడా వచ్చి చేరింది. జీ20 దేశాల నేతలు అందరూ సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆదివారంతో ఈ సదస్సు ముగుస్తుంది. దీనికంటే ముందు అన్ని దేశాలతో కూడిన ఉమ్మడి డిక్లరేషన్ విడుదల కానుంది. సదస్సులో భాగంగా చర్చించి, ఏకాభిప్రాయం కుదిరిన అంశాలకు ప్రకటనలో చోటు లభిస్తుంది. ఈ సదస్సుతో జీ-20కి భారత్ నాయకత్వం ముగుస్తుంది. 2024 సంవత్సరానికి గాను బ్రెజిల్ జీ-20 అధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తుంది. 2025లో దక్షిణాఫ్రికా ఈ బాధ్యతలు నిర్వహించనుంది.

More Telugu News