Revanth Reddy: ఐదు గ్యారంటీలను సోనియాగాంధీ ప్రకటిస్తారు: రేవంత్ రెడ్డి

  • ఈ నెల 17న హైదరాబాద్ లో కాంగ్రెస్ బహిరంగ సభ
  • సభకు 10 లక్షల మంది హాజరవుతారన్న రేవంత్ రెడ్డి
  • ఈ సభలో ఐదు హామీలను సోనియా ప్రకటిస్తారన్న రేవంత్
Sonia Gandhi will announce 5 guarantees says Revanth Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచుతోంది. వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్యూసీ) సమావేశాలను కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు ఈ నెల 17న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించబోతోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హాజరవుతున్నారు. 


ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పరేడ్ గ్రౌండ్ లో సభకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 2న రక్షణ శాఖకు లేఖ రాశామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ ను ఇవ్వకపోతే ఎల్బీ స్టేడియంను ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సభను వాయిదా వేయబోమని చెప్పారు. అవసరమైతే ఔటర్ రింగ్ రోడ్ వెలుపల సభను నిర్వహిస్తామని అన్నారు. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని చెప్పారు. ఈ సభావేదిక మీద సోనియాగాంధీ 5 గ్యారెంటీలను ప్రకటిస్తారని తెలిపారు. సోనియా ప్రకటించే 5 హామీలను సెప్టెంబర్ 18 నుంచి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పారు.

More Telugu News