Teacher: క్లాసులో గొడవపడిన ముస్లిం విద్యార్థులు... "పాకిస్థాన్ వెళ్లండి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్!

  • కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఘటన
  • ఇది హిందూ దేశం అంటూ విద్యార్థులపై మండిపడిన టీచర్!
  • టీచర్ వ్యాఖ్యలను కుటుంబ సభ్యులకు తెలిపిన విద్యార్థులు
  • టీచర్ ను బదిలీ చేసిన విద్యాశాఖ
Teacher comments creates rage in Sivamogga dist

కర్ణాటకకు చెందిన ఓ టీచర్ చేసిన వ్యాఖ్యలు ఓ వర్గం వారిని ఆగ్రహావేశాలకు గురిచేశాయి. శివమొగ్గ జిల్లాలోని ఓ గవర్నమెంట్ పాఠశాలలో మంజులాదేవి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 

అయితే తన క్లాసులో ఇద్దరు ముస్లిం విద్యార్థులు గొడవ పడుతుండగా, మంజులాదేవి వారిని ఉద్దేశించి "పాకిస్థాన్ వెళ్లి కొట్టుకోండి... ఇది హిందూ దేశం" అన్నట్టుగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. టీచర్ చేసిన వ్యాఖ్యలను ఆ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. 

దాంతో మండిపడిన ఆ విద్యార్థుల కుటుంబ సభ్యులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు  మంజులాదేవిని బదిలీ చేశారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీసులు కూడా టీచర్ వ్యాఖ్యలపై విచారణ ప్రారంభించారు.

More Telugu News