ఇస్రో విజయాలకు మతం రంగు పులమాలనుకుంటున్నారు: సీపీఐ నారాయణ
- ఇస్రో విజయాలను రాజకీయాలకు మోదీ వాడుకోవాలనుకుంటున్నారన్న నారాయణ
- దేశంలోని కొన్ని కారణాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్య
- దేశం మొత్తం ఒకే పార్టీ ఉండాలని మోదీ అనుకుంటున్నారని విమర్శ
దేశ వ్యాప్తంగా నెలకొన్న కొన్ని కారణాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని... ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. ఎన్డీయే కూటమిలో ఒక 8 పార్టీలు తప్ప మిగిలినవన్నీ ఉత్తుత్తి పార్టీలేనని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ఒకే పార్టీ ఉండాలని మోదీ చూస్తున్నారని అన్నారు. జమిలీ ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.