YS Jagan: లండన్ పర్యటనకు భార్య భారతితో కలిసి బయలుదేరిన సీఎం జగన్

  • విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన జగన్
  • విచారణ అనంతరం అనుమతి మంజూరు చేసిన సీబీఐ కోర్టు
  • శనివారం రాత్రి లండన్‌కు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి
YS Jagan leavs for London

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా లండన్ పర్యటనకు బయలుదేరారు. శనివారం రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం బయలుదేరారు. పది రోజుల విదేశీ పర్యటన అనంతరం ఈ నెల 12న తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న జగన్, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తమ విదేశీ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం వారికి సెప్టెంబర్ 2 నుండి 12వ తేదీ మధ్య పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది.

More Telugu News