YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి

  • సీబీఐ కోర్టుకు రెండోసారి హాజరైన అవినాశ్ రెడ్డి
  • జైల్లో ఉన్న నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు
  • తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా
YS Avinash Reddy attends CBI court

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. కేసులో సీబీఐ కోర్టుకు ఆయన రావడం ఇది రెండో సారి. అవినాశ్ ను ఈ కేసులో సీబీఐ ఏ8గా చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు 145 పేజీలతో కూడిన మూడో ఛార్జ్ షీట్ ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డిలను కూడా పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. తదుపరి విచారణను కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది.

More Telugu News