KCR: చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కనిపించనున్న కేసీఆర్, చిన్నజీయర్ స్వామి

  • సమతా విగ్రహావిష్కరణ సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు
  • సెప్టెంబర్ 4న వల్మిడిలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం
  • కార్యక్రమానికి హాజరవుతున్న జీయర్, కేసీఆర్
KCR and Chinna Jeeyar Swamy to share a stage

తొలి నుంచి కూడా చిన్నజీయర్ స్వామి, కేసీఆర్ లకు చాలా సాన్నిహిత్యం ఉండేది. అయితే ముచ్చింతల్ లో సమతా విగ్రహావిష్కరణ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఇద్దరికీ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకోలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై కనిపించనున్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడిలో సెప్టెంబర్ 4న శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరవుతున్నారనే విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

More Telugu News