జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో సీక్రెట్ గా షారుక్ ఖాన్ ప్రత్యేక పూజలు
- మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డ షారుక్
- ముఖానికి మాస్క్ ధరించిన బాలీవుడ్ బాద్షా
- సెప్టెంబర్ 7న విడుదల అవుతున్న షారుక్ తాజా చిత్రం 'జవాన్'
మరోవైపు, షారుక్ తాజా చిత్రం 'జవాన్' సెప్టెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో నయనతార, ప్రియమణి, విజయ్ సేతుపతి, యోగిబాబు వంటి సౌత్ స్టార్లతో పాటు సంజయ్ దత్, రియాజ్ ఖాన్, గిరిజా ఓక్ తదితర బాలీవుడ్ నటులు నటించారు. ఈ సినిమా కోసమే వైష్ణోదేవి ఆలయంలో షారుక్ పూజలు నిర్వహించారని చెప్పుకుంటున్నారు. ఏడాది కాలంలో ఈ ఆలయాన్ని షారుక్ సందర్శించడం ఇది రెండో సారి.