ఇంధన ధరలపై కేంద్రం త్వరలో కీలక నిర్ణయం..?
- కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించే అవకాశం ఉందన్న ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్
- వంట గ్యాస్ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం 30 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అంచనా
- ఉల్లి, గోధుమ, ధరల తగ్గుదల కూడా తోడై ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందంటున్న నిపుణులు
ఆర్థిక నిపుణుల ప్రకారం.. నిత్యావసర ధరలు తగ్గించేందుకు కేంద్రం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే గ్యాస్ ధర తగ్గించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనికి తోడు ఇంధన ధరలు కూడా తగ్గితే ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.